బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం.. మోదీకి ట్రంప్ అభినందనలు.. అంతర్జాతీయ మీడియా కథనాలు
- 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు
- ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ప్రజా శక్తి సాధించిన విజయమని అభివర్ణించిన ప్రధాని మోదీ
- ఇది బీజేపీ ఏడేళ్ల కృషి ఫలితమన్న విశ్లేషకులు
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ అపూర్వ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని వైట్హౌస్ "చారిత్రాత్మకమైనది"గా అభివర్ణించింది. "భారత్కు మోదీ వంటి నాయకుడు ఉండటం అదృష్టమని, ఆయన నాయకత్వంపై తమకు ఎంతో అభిమానం ఉందని గత నెల ఫోన్ సంభాషణలో ట్రంప్ ప్రధానితో చెప్పారని" వైట్హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు.
ఈ విజయంతో పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ ఫలితం ప్రధాని మోదీకి తన మూడో పర్యాయ పాలన మధ్యలో రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ విజయం అనంతరం ఢిల్లీలో మద్దతుదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. "బెంగాల్ భవిష్యత్తులో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రజాశక్తి గెలిచింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను" అని ఆయన అన్నారు.
మోదీ ఇప్పటివరకు గెలిచిన అత్యంత కఠినమైన రాజకీయ క్షేత్రాల్లో ఇది ఒకటని బీబీసీ తన కథనంలో పేర్కొంది. ది గార్డియన్ రిపోర్ట్ ప్రకారం, ఇది బీజేపీ నాయకత్వం ఏడేళ్లుగా పన్నిన వ్యూహం ఫలితమని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్కు చెందిన రాహుల్ వర్మ విశ్లేషించారు. "బెంగాల్లో బీజేపీకి బలమైన, వ్యవస్థీకృత నిర్మాణం ఉంది. హిందూ ఓట్ల ఏకీకరణ జరగకుండా ఇంతటి విజయం సాధ్యమయ్యేది కాదు" అని ఆయన వివరించారు. చాలా కాలంగా ప్రాంతీయ, వామపక్ష రాజకీయాలకు కంచుకోటగా ఉన్న బెంగాల్లో బీజేపీ విజయం భారత రాజకీయ చిత్రపటంలో ఒక ముఖ్యమైన మార్పు అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
ఈ విజయంతో పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ ఫలితం ప్రధాని మోదీకి తన మూడో పర్యాయ పాలన మధ్యలో రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ విజయం అనంతరం ఢిల్లీలో మద్దతుదారులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. "బెంగాల్ భవిష్యత్తులో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ప్రజాశక్తి గెలిచింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను" అని ఆయన అన్నారు.
మోదీ ఇప్పటివరకు గెలిచిన అత్యంత కఠినమైన రాజకీయ క్షేత్రాల్లో ఇది ఒకటని బీబీసీ తన కథనంలో పేర్కొంది. ది గార్డియన్ రిపోర్ట్ ప్రకారం, ఇది బీజేపీ నాయకత్వం ఏడేళ్లుగా పన్నిన వ్యూహం ఫలితమని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్కు చెందిన రాహుల్ వర్మ విశ్లేషించారు. "బెంగాల్లో బీజేపీకి బలమైన, వ్యవస్థీకృత నిర్మాణం ఉంది. హిందూ ఓట్ల ఏకీకరణ జరగకుండా ఇంతటి విజయం సాధ్యమయ్యేది కాదు" అని ఆయన వివరించారు. చాలా కాలంగా ప్రాంతీయ, వామపక్ష రాజకీయాలకు కంచుకోటగా ఉన్న బెంగాల్లో బీజేపీ విజయం భారత రాజకీయ చిత్రపటంలో ఒక ముఖ్యమైన మార్పు అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.